‘బిగ్ బాస్ ఓటీటీ’కి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు 24 గంటలు ఫోన్లకు అతుక్కుపోయేలా చేస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ లో అయితే వారంలో రెండు రోజులైనా వాళ్లను వదిలేసేవారు. కానీ, నాన్ స్టాప్ లో మాత్రం అసలు గ్యాప్ లేకుండా టాస్కులతో అల్లాడిస్తున్నారు. ప్రతి విషయాన్ని టాస్కులకు ముడిపెట్టి గెలిచిన వాళ్లే బెడ్ రూమ్ లో పడుకోవాలి. గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్లు సేవలు చేయాలి. గెలిచిన వాళ్లు లూసర్స్ కు పనిష్మెంట్స్ ఇవ్వాలి అంటూ ఛాలెంజర్స్- వారియర్స్ కు బాగానే గొడవలు పెడుతున్నారు.
వీళ్లు ఇచ్చిన టాస్కులతో వాళ్లు రోజులో 18 గంటలు గొడవలు, పంచాయతీలతోనే గడిపేస్తున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో మాత్రం ఆటవిడుపు కార్యక్రమాలు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కొన్నిసార్లు అవి కాస్త శ్రుతి మించుతున్నాయి కూడా. గతంలో అంటే బిగ్ బాస్ గంటే కాబట్టి సెన్సారింగ్ చేసి విడుదల చేసేవారు. ఇప్పుడు నాన్ స్టాప్ కాబట్టి అన్ని విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. అలాగే మంగళవారం రాత్రి హౌస్ లో జరిగిన ఓ సంఘటన కొందరిని ఇబ్బంది పెట్టింది.
లైట్లు ఆపగానే అషురెడ్డి- చొకారపు స్రవంతి ఒకే బెడ్ షీట్లోకి దూరారు. వాళ్లు అలా మామూలుగా ఉంటే ఎవరికీ ఛీ అనిపించేది కాదు. మిగతా సభ్యులు చేసిన కామెంట్లతో అక్కడ పరిస్థితి మొత్తం బ్యాడ్ గా వ్యక్తీకరణ జరిగింది. మధ్యలో ఇద్దరూ ఆ బెడ్ పైనే ఉన్నారు.. నా బెడ్ పైకి ఎవరు వస్తారు అనడంతో మరీ గబ్బు అయ్యింది. ఆ తర్వాత మాటలు చెప్పేందుకు అని కవర్ చేసినా అక్కడ అంతా మారిపోయింది. అజయ్ అసలే పెళ్లైన అమ్మాయి ఏం చేస్తున్నారు అనడం.. అందరూ ఒకేసారి కేకలు వేయడం ఛీ అనిపించేలా చేసింది. ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకోవడం సహజమే. కానీ, లైవ్ టెలికాస్ట్ అవుతుందనే ఆలోచన ఉండాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.