బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్ మొత్తం హీట్ మీదుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కు ‘బీబీ హోటల్’ ప్రారంభం కావడంతో ఆ హీట్ ఇంకాస్త ఎక్కువైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్లో చాలా మార్పులే జరిగాయి. ఒకేసారి 20 మంది సభ్యులను ఇంట్లోకి పంపారు. అంతేకాకుండా మెరీనా- రోహిత్ ఇద్దరినీ ఒక కంటెస్టెంట్ కింద చెప్పుకొచ్చారు. టాస్కులు కూడా దాదాపు చాలా టఫ్గా ఉండేలా చూస్తున్నారు. అవి మాత్రమే కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కొత్తగా వచ్చిన మార్పు ప్రేక్షకులు. అవును కరోనా తర్వాత ఈ సీజన్లో ప్రేక్షకులను శనివారం, ఆదివారం షూట్కి అనుమతించడం ప్రారంభించారు. కొందరిని ఆహ్వానించి వారితో ఇంట్లోని సభ్యులను ప్రశ్నలు కూడా అడిగిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆ ఆడియన్స్ మీద ఒక ట్రోలింగ్ నడుస్తోంది. అసలు వాళ్లు ఆడియన్స్ కాదు పెయిడ్ ఆర్టిస్టులంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఆడియన్స్ లాగా చూపిస్తూ.. మోసం చేస్తున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రేక్షకుల పేరుతో వారికి నచ్చిన ప్రశ్నలు అడగడం, సమాధానాలు కూడా వారికి నచ్చినవే చెప్పించుకుంటున్నారు అని చెబుతున్నారు. అంతా స్క్రిప్టెడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎపిసోడ్ లో కనిపించిన వాళ్లు మరో ఎపిసోడ్లో కూడా కనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి పిక్స్ చూపిస్తూ ఇది స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ అనే కాదు.. ఇలాంటి షోలకు ఎవరినీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆసక్తిగల వారు అవకాశం ఇస్తే వచ్చి షూట్లో కూర్చునే అభిమానులు చాలా మంది ఉంటారు. వాస్తవానికి వారంతా ప్రేక్షకులే అని, ఆర్టిస్టులు కాదని మాకు తెలిసిన పక్కా సమాచారం. కాకపోతే ఒక యువతి రెండు ఎపిసోడ్లలో కనిపించడంతో ఈ ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోని పెయిడ్ ఆర్టిస్టులతో ప్రేక్షకులకు మోసం చేయాల్సిన అవసరమే లేదు. అది కొందరు కావాలని చేస్తున్న ట్రోలింగ్గా బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి ఈ షోపై వచ్చే ట్రోలింగ్, నెగెటివిటీపై యాజమాన్యం స్పందించింది అయితే లేదనే చెప్పాలి.