బిగ్ బాస్ 6వ సీజన్ లో గీతూ హడావుడి మాములుగా లేదు. పాజిటివో నెగటివో పక్కనబెడితే.. ప్రేక్షకులందరూ ఆమె గురించే మాట్లాడుకునేలా చేస్తోంది. ఓవైపు ఈమె ఆటతీరుపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ.. తోటి హౌస్ మేట్స్ మాత్రం ఈమె బిహేవియర్ గురించి తెగ డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇనయాతో ఈ వారం జరిగిన నామినేషన్స్ టైమ్ లో దొబ్బేయ్ లాంటి పదాలు వాడి రచ్చరచ్చ చేసింది. దీంతో నాగార్జున కూడా గీతూతో ఇదే విషయాన్ని మాట్లాడుతూ చురకలంటించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హౌసులో ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పేరు చెప్పగానే గీతూ, రేవంత్ మాత్రమే గుర్తొస్తారు. ప్రతి టాస్క్ విషయంలోనూ తామే ముందుండాలని తాపత్రయపడుతున్నారు. గీతూ అయితే ఏది ఏమైనా సరే గెలిచి తీరడమే ముఖ్యమనేటట్లుగా ఆడుతోంది. ఈ క్రమంలోనే రేవంత్, ఆమె మాటలకు బాగా హర్ట్ అయ్యాడు. ఆ విషయాన్నే అర్జున్ కల్యాణ్ దగ్గర చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘కొంతమంది ఎమోషన్స్ ని కూడా యాక్టింగ్ అంటున్నారు. వాళ్లకి ఫ్యామిలీ వాల్యూ తెలీదు. గీతూ అంటుంది.. తల్లిప్రేమ కంటే కుక్క ప్రేమ గొప్పదట.’
‘అసలు ఇలాంటి వాళ్లని ఎందుకు పిలిచారో.. ఇలాంటివాళ్లు ఉన్న హోసులో నేను ఎందుకు ఉన్నానా అని సిగ్గుపడుతున్నా. రివ్యూ సిస్టమ్ నుంచి బయటకు రావడంతో ప్రతిదీ తెలుసనుకుంటున్నారు. అబ్బాయి అయిన మనకే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎథిక్స్ లేవు. ఆమెని చూస్తుంటే అనిపిస్తుంది ఛీఛీ ఎందుకు వచ్చాం ఇలాంటి వాళ్లు ఉన్న హౌసుకి అని.. గీతూ గురించి చాలా విన్నాను. ఆమె ఎంతకైనా తెగిస్తుంది. ఏమైనా చేస్తుంది అని.. కానీ మరి ఇంత దారుణంగా అని తెలియదు. గీతుతో పోల్చుకుంటే ఆదిరెడ్డి చాలా బెటర్. జనాలకు ఏం నచ్చుతుందో కూడా వీళ్లే చెప్పేస్తున్నారు. వీళ్లేమైనా దేవుళ్లా? నాకు అర్థం కావడం లేదు. వీళ్లని అసలు మనం కాంపిటీటర్స్ లెక్కలోకి తీసుకోకూడదు’ అని రేవంత్ తెగ ఫీలయ్యాడు. మరి గీతూపై రేవంత్ అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హౌస్ట్ నాగార్జున