బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చే వాళ్లందరూ గెలవడానికే వస్తారు. కాకపోతే ఆ అదృష్టం ఒకరికే దక్కుతుంది. ఈ క్రమంలో ఎన్నో టాస్కులు, నామినేషన్స్, గొడవలు, వాదోపవాదాలు.. ఇలాంటివి చాలా దాటి వెళ్లాలి. ఇదంతా జరుగుతున్న సమయంలో ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఉండాలి. ఆ నమ్మకంతోనే ప్రతి గేమూ ఆడి, తమని తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీవీలో ప్రసారమైన గత ఐదు సీజన్లు కూడా ఇలానే రేంజులో జరిగాయి. ప్రస్తుత సీజన్ మాత్రం దానికంటే కాస్త డిఫరెంట్ గా ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ మొదలై రెండువారాలుపైనే అయిపోయింది. వచ్చిన 21 మందిలో షానీ, అభినయ శ్రీ ఎలిమినేట్ కూడా అయిపోయారు. తొలివారం ఎలాగోలా తప్పించుకున్నారు కానీ.. తాజాగా జరిగిన వీకెంట్ ఎపిసోడ్ లో మాత్రం శనివారం ఒకరు, ఆదివారం ఒకరు.. హౌస్ నుంచి బయటకొచ్చేశారు. దీంతో హౌసులో మిగతా సభ్యుల్లో భయం మొదలైంది. ఎక్కడ తాము ఎలిమినేట్ అవుతామోనని.. అందుకే మూడోవారం నామినేషన్స్ లో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ రచ్చ చేశారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈసారి నామినేషన్ ప్రక్రియ యమ రంజుగా సాగింది. ఫస్ట్ ఫస్ట్ శ్రీసత్య.. ఇనయాని నామినేట్ చేయగా, సిల్లీ రీజన్ కి తనని నామినేట్ చేశావని ఆర్జీవీ బ్యూటీ రెచ్చిపోయింది. ఇక గీతూ.. సుదీపని నామినేట్ చేసింది. బేబీల గురించి ఎమోషనల్ జర్నీ జరుగుతున్నప్పుడు, ఏడ్చి టిష్యూస్ సుదీప అక్కడే వదిలేసిందని గీతూ చెప్పింది. ‘ఇంత సిల్లీ రీజన్ కి నన్ను నామినేట్ చేశావంటే.. నీ బుద్ధి ఎలాంటిదో అర్ధమైంది’ అని సుదీప కౌంటర్ వేసింది. చంటిని కూడా నామినేట్ చేసిన గీతూ.. తను చేసిన కూర తినలేదని, దానికి హర్ట్ అయ్యానని చెప్పింది.
అలానే గీతూని నామినేట్ చేసిన ఇనయా.. తనకి బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ ఇస్తానని చెప్పి, అందులో బట్టలు పెట్టుకుందని.. ఫెయిర్ గేమ్ ఆడట్లేదని గీతూపై విమర్శలు చేసింది. ఇవే కాదు పలువురు కంటెస్టెంట్స్.. గేమ్ గురించి కాకుండా చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెబుతూ బిగ్ బాస్ హౌస్ ని సిల్లీగా మార్చేస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే గేమ్ పై దృష్టి అందుకు తగ్గట్లు ఫెర్ఫార్మ్ చేయాలి. లేదంటే మొదటికే మోసం వచ్చి, అలాంటి వాళ్లు ఎలిమినేట్ అయ్యే ఛాన్సుంది. మరి బిగ్ బాస్ హౌసులో సిల్లీ గొడవలు, నామినేషన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:హౌస్ మేట్స్ పరువు తీసేసిన బిగ్ బాస్ ఆరోహి!