బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యి సుమారు నెల రోజులు అవుతుంది. కానీ ప్రేక్షకులు ఊహించిన ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికి కూడా ఎవరికి వారు సేప్ గేమ్ ఆడుకుంటూ.. తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి సెపరేట్ స్ట్రాటజీతో దూసుకుపోతుంది గీతు రాయల్. తాను ఆట కోసమే బిగ్బాస్లోకి వచ్చాని.. అవసరమైతే ఆటలో ఉంటే.. తన తల్లిదండ్రులను కూడా ఓడిస్తానని.. గేమ్లో గెలవడమే తనకు ముఖ్యమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. గేమ్ గురించి తప్ప తన వ్యక్తిగత విషయాల గురించి ఇప్పటి వరకు హౌస్లో డిస్కస్ చేయలేదు. అయితే గీతుకి వివాహం అయిన సంగతి తెలిసిందే. వికాస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది గీతు. వీరిద్దరూ మొదటి నుంచి ఫ్రెండ్స్ కూడా.
ఇదిలా ఉంటే హౌస్లో అప్పుడప్పుడు గీతు ఆట చూసిన వారు.. ఈమెందిరా బాబు ఇలా ఉంది.. కొంపదీసి మైండ్ దొబ్బిందా ఏంటి అనే అనుమానం వ్యక్తం చేస్తారు. అలానే ఆమె గేమ్ స్ట్రాటజీని విమర్శించే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే దీని గురించి బిగ్బాస్లో హౌస్లోకి వచ్చాక.. ఓ సారి నాగార్జున ముందు అసలు విషయం వెల్లడించింది గీతు. తనకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి.. కోమాలోకి వెళ్లానని.. అందువల్ల కొన్ని విషయాలు తనకు గుర్తుండవని గీతు చెప్పుకొచ్చింది. కొన్ని సందర్భాల్లో ఆమె మాటలు, ప్రవర్తన చూసిన వారు.. నిజంగానే ఈమెకు చిన్నమెదడు చితికి ఉంటుంది అని భావిస్తారు.
ఈ నేపథ్యంలో అసలు గీతుకి నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందా.. ఒకవేళ అయితే.. ఎప్పుడు.. ఎక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాన్నుంచి ఆమె ఎలా బయటపడిందనే విషయాలను తెలియజేశాడు గీతు భర్త వికాస్. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ..‘‘2014లో గీతుకి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆరోజును నేను ఎప్పుడు మర్చిపోలేను. 2014, సెప్టెంబర్ 15న తనకు ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. నేను తను బెంగుళూరులోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం బస్ ఎక్కాం. ఇంకో అర కిలోమీటర్ ప్రయాణం చేస్తే.. మేం దిగే స్టాప్ వస్తుంది. ముందుకు వచ్చి ఫుట్బోర్డ్ దగ్గర నిలబడి ఉన్నాం’’ అని తెలిపాడు.
‘‘ఇంతలో ఉన్నట్లుండి గీతుకి ఒక ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తనకు బొమ్మరిల్లు సినిమాలో రన్నింగ్ బస్ సీన్ గుర్తుకు వచ్చిందో లేదంటే.. ఫుట్ బోర్డ్ దగ్గర నిలబడటం వల్లనో తెలియదు కానీ.. సడెన్గా రన్నింగ్ బస్ నుంచి దూకేసింది. ఒక్కక్షణం ఏమౌతుందో తెలియలేదు. దూకేసిన తరువాత రోడ్డుపై పడిపోయింది. దాంతో తనకు బలమైన గాయం అయ్యి ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. జనాలు వచ్చి గుమికూడి చూస్తున్నారు. కానీ సాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘గీతును ఆ పరిస్థితుల్లో చూసి.. అసలు తను బతికుందా.. చనిపోయిందా అర్థం కాలేదు. నేనైతే చనిపోయిందనే అనుకున్నాను. దగ్గరకు వెళ్లి.. ఎంత లేపినా లేవడం లేదు. సాయం చేయమని అరుస్తున్నా.. ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి కారు ఆపి.. అందులో మమ్మల్ని ఎక్కించుకుని హాస్పటల్కి తీసుకుని వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత కూడా గీతు బతుకుతుందనే నమ్మకం నాకు లేదు. గీతుని ఎలాగైనా బతికించండి అని ఏడుస్తూనే ఉన్నాను. అప్పటికే తను కోమాలోకి వెళ్లిందని చెప్పారు. ఒక గంట తరువాత డాక్టర్లు వచ్చి.. తన ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పారు.. అప్పుడు నాకు ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది’’ అన్నాడు.
‘‘ఇక గీతూ కోమాలో నుంచి బయటకు వచ్చిన తరువాత చాలా విషయాలు మర్చిపోయింది. దాని వల్ల నష్టం ఉంది.. లాభం ఉంది. కొన్ని మర్చిపోవాల్సిన విషయాలను నిజంగానే మర్చిపోతుంది.. ఆ టైంలో ఆమె మతిమరుపు మంచిదే అనిపిస్తుంది.. కానీ కొన్ని సందర్భాల్లో ఎంతో ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతుంది.. ఆ టైంలో అబ్బా ఇలా మర్చిపోతే ఎట్టాగబ్బా అనిపిస్తుంది’’ అంటూ గీతు యాక్సిడెంట్ గురించి చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు ఆమె భర్త వికాస్.