బిగ్ బాస్ అంటే ఇరవై నాలుగు గంటలు కెమెరాలు ఆన్ లో ఉంటాయి. హౌసులో ఉన్న వాళ్లు ఏం చేసినా సరే రికార్డు అవుతుంది. ప్రేక్షకులు ప్రతిదీ గమనిస్తుంటారు. ఇవన్నీ పార్టిసిపెంట్స్ కి బాగా తెలుసు కాబట్టి.. ఒక్కసారి హౌసులో అడుగుపెట్టడమే లేటు.. కెమెరాకు కనిపించాలని ఒక్కొక్కళ్లు తాపత్రయపడుతుంటారు. గేమ్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కొందరు మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. హౌసులో ఉన్న లేనట్లే ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు అలాంటి వాళ్లు త్వరగా ఎలిమినేట్ అయిపోతారు. మరికొన్నిసార్లు మాత్రం చివరి వరకు కొనసాగుతారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభమై వారం దాటింది. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఎదురుచూసిన ప్రేక్షకులు.. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లరని తెలిసి రిలాక్స్ అయిపోయారు. ఇక రెండోవారంలోకి ఎంటర్ కావడంతో గొడవలు,రచ్చ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హౌసులో డిస్కషన్స్ కూడా క్రేజీగా మారాయి. రాజశేఖర్ గురించి గీతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు హౌసులో ఉన్నాసరే పెద్దగా కనిపించట్లేదని పేర్కొంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే ఛాలెంజింగ్ గా లేదంటే ఛాలెంజ్ విసిరేలా ఉండాలని అభిప్రాయపడింది. అసలు ఇంట్లో ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదని చెప్పింది. ఉన్నా లేనట్లుగానే ఉంటున్నాడని తెలిపింది. ఇక్కడికి రావాల్సిన ఏ లక్షణం కూడా కనిపించట్లేదని అభిప్రాయపడింది. ఇలా రాజశేఖర్ గురించి గీతూ-ఆదిరెడ్డి డిస్కషన్ చేసుకున్నారు. ఇకపోతే రాజశేఖర్ అయితే హౌసులో అసలు యాక్టివ్ గా ఉన్నట్లే కనిపించట్లేదు. గొడవ పడినట్లు, టాస్కులో పాల్గొన్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియట్లేదు అంటేనే మీరు అర్ధం చేసుకోవచ్చు. మరి గీతూ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ హీట్.. ఏకంగా 8 మంది..!