‘బిగ్ బాస్’ సీజన్ 5.. ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. బిగ్బాస్ 5వ సీజన్ ముగుస్తున్న సమయంలో బిగ్బాస్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ రోజు ఇంటి సభ్యులంతా ‘బిగ్ బాస్’ గత సీజన్ కంటెస్టెంట్లను కలవనున్నారు. గీతా మాధురి, రోలో రైడా, శివ బాలాజీ, హరితేజ, అరియానా, అఖిల్, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు శనివారం ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ఫన్నీ ప్రశ్నలు.. సమాధానాలతో సందడిగా సాగింది. అయితే ఈ బాలాజీ, హరితేజ లు షన్నూ.. మానస్ ని అల్లరి పెట్టారు.
ఇక రోల్ రైడా మీ గొడవలు నైట్ వదిలేస్తున్నారు.. తెల్లారి కొత్తగా కొట్టుకుంటున్నారని జోక్ విసిరాడు. ఈ సందర్బంగా రవితేజ పీకతో ఓ పాట పాడింది. అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట అని చెప్పడంతో అందరూ డ్యాన్స్ వేశారు. ఆ సమయంలో షన్నూని సిరి మరోసారి దగ్గరికి తీసుకుంది. ఆ సమయంలో హరితేజ వారి ముగ్గురు పరిస్థితి చూడు అంటూనే శ్రీరామ చంద్ర లాస్ట్ కి చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరూ లేకుండా పోయారే అని కామెంట్ చేసింది.
శ్రీరామ చంద్ర స్పందిస్తూ.. ‘మా బాధ అర్థం చేసుకొని నిన్న బిగ్ బాస్ ఎలిమినేషన్ అంటూ.. సిరిని పంపిచేస్తే మేమందరం ఎస్.. ఎస్.. అనుకున్నాం.. మళ్లీ కన్ఫెషన్ రూమ్ నుంచి షన్నూ అనుకుంటూ వచ్చేసిందంటూ’ సిరి పరువు తీశాడు శ్రీరామ చంద్ర. దాంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారే నవ్వుకున్నారు. ఈ విషయం ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.