తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటితో ముగిసింది. అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ ట్రోపీని.. ప్రజల మనసును గెలుచుకున్నాడు వీజే సన్ని. యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ రన్నరప్గా నిలిచాడు. ఈసారి ఫినాలేకి చేరుకున్న వారిలో సన్ని, శ్రీరామ చంద్ర,మానస్, షణ్ముక్,సిరి ఉన్నారు. అయితే ఫినాలే వరకు రావడం అంటే అంత సామాన్య విషయం కాదని అంటారు.. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.. వారందరిని దాటుకొని ఫైనల్ వరకు చేరుకోవడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం.
ఇక ఫైనల్ లోకి వచ్చిన సిరి హన్మంతు విషయానికి వస్తే.. బిగ్ ఫైర్ అనే చెప్పొచ్చు. ఈ విషయం బిగ్బాసే స్వయంగా చెప్పాడు. ఈ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరివి నీవంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపించాడు. ఈ సీజన్లో 15 వారాలు ఉండటమే కాక టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్గా సిరి చరిత్ర సృష్టించింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై హోస్ట్ అక్కినేని నాగార్జునతో తన బిగ్బాస్ అనుభవాలను పంచుకున్నారు. తాను ఇక్కడి దాకా రావడమే గొప్పగా భావించానని, అదే తనకు టైటిల్తో సమానమని అన్నారు. షణ్ముఖ్ పేరు ఎత్తకుండా.. అతనితో తనకు ఉన్న రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇచ్చారు.
తనకు తండ్రి లేరని అన్నారు. తమను పెంచి పోషించడానికి తల్లి కూడా వ్యాపారపరంగా బిజీ కావడం వల్ల ఆమెతోనూ అటాచ్మెంట్ తక్కువేనని చెప్పారు. అందుకే తాను త్వరగా ఎమోషన్ అవుతుంటానని అన్నారు. తాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని.. 15 వారాలు తనని భరించినందుకు అందరికీ ధన్యావాదాలు తెలిపింది. ఇక గ్రాండ్ ఫినాలేలో ఐదో స్థానంలో ఉండగానే ఎలిమినేట్ అయిన సిరికి బిగ్బాస్ నుంచి ఎంత ముట్టిందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్లో వెబ్ సిరీస్తో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ సిరి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ లోకి రావడానికి సిరికి వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల మేర ఇస్తామని ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే గనక నిజమైతే సిరి పదిహేను వారాలకు గానూ సుమారు పాతిక లక్షల మేర పారితోషికం అందినట్లే లేక్క.. అంటే ట్రోఫీ విన్నర్ గెల్చుకున్న దానిలో సగం వచ్చినట్లు. మొత్తానికి బిగ్ బాస్ ఫైనల్ వరకు చేరుకొని మంచి రెమ్యూనరేషన్ తో బయటకు వచ్చిందని ఆమె అభిమానులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.