ఆకుపచ్చని తెలంగాణే తన ధ్యేయమని మూడేళ్ల క్రితం ఒక ఉద్యమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 కోట్ల మొక్కలను నాటించినట్లు వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలను సైతం ఇందులో భాగస్వాములను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అతిథిగా విచ్చేసిన ఎంపీ.. వారికీ ఒక మొక్కను బహూకరించారు. వారానికో మొక్క నాటాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రభాస్ అడవిని దత్తత తీసుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. హైదరాబాద్ శివారులో ప్రభాస్.. తండ్రి పేరు మీద 1650 ఎకరాల అడవిని దత్తత తీసుకున్నట్లు వివరించారు.
అయితే ప్రభాస్ లా నేను కూడా ఒక అడవిని దత్తత తీసుకుంటానని కోరాడు నాగార్జున. అందుకు ఎంపీ సంతోష్ కుమార్ ఎంతో ఆనందపడ్డారు. తప్పకుండా ఏర్పాటుల్లు చేస్తానని మాటిచ్చారు. అయితే నాగార్జున దాదాపు 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మిగిలిన సెలబ్రిటీలు కూడా వీరి దారిలోనే నడిచే అవకాశం ఉంది. హైదరాబాద్ శివార్లలో అలాంటి క్లస్టర్లు 88 వరకు ఉన్నట్లు ఎంపీ తెలిపారు. అంటే సెలబ్రిటీలు ముందుకొస్తే కనుమరుగువుతున్న అడవులు మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. నాగార్జున తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్ధిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
*King Nagarjuna comes forward to adopt 1000 acres forest:*#greenindiachallenge Reaches Big Boss 5 @MPsantoshtrs @iamnagarjuna @amalaakkineni1 @AkhilAkkineni8 @chay_akkineni @ErikSolheim @StarMaa @DrRanjithReddy @UrsVamsiShekar pic.twitter.com/HU3VqXFeA8
— Raghav s (@raghavtrs) December 12, 2021