YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై ఇకపై నెలనెలా ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు స్కూళ్లలోని సమస్యలను ఫిర్యాదు చేయటానికి వీలుగా ప్రతీ స్కూల్లో 14417 టోల్ఫ్రీ నెంబర్ బోర్డు ఉంచాలన్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎమ్లు ప్రతీ నెలా స్కూళ్లను సందర్శించాలని ఆదేశించారు.
ముగ్గురు గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ప్రతీ వారం స్కూళ్ల దగ్గరకు వెళ్లాలని, స్కూళ్లలోని తేడాలను గుర్తించి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని అన్నారు. వాటిపై అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. మార్చి 2023లోగా స్కూళ్ల డిజిటలైజేషన్ పూర్తవ్వాలని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ సదుపాయం కేవలం స్కూళ్లలో మాత్రమే కాకుండా డిజిటల్ లైబ్రరీలలో, గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో, గ్రామ క్లినిక్స్లో కూడా అందుబాటులో ఉండాలన్నారు. మరి, సీఎం జగన్ విద్యాశాఖపై జరిపిన సమీక్షా సమావేశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bendapudi: దేశంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా బెండపూడి!