కృష్ణా జిల్లా గుడివాడలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీసీ రంగులు వేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీనిపై వెంటనే స్పందించారు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. టీడీపీ నేతలు బొమ్ములూరుకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహ దిమ్మెకు వైసీపీ రంగులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు ఉన్న వైసీపీ రంగులు పూర్తిగా చెరిపేసి పసుపు రంగులు వేశారు. ఇక దీంతో పాటు అక్కడి టీడీపీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: Amaravati Lands: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకానికి అమరావతి భూములు.. ధర కోట్లలో!
ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మహానాడు బ్యానర్లపై అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీమంత్రి పిన్నమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గం అన్నారు. ఇక కొద్ది సేపటి తర్వాత టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం బొమ్మలూరు ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. మరో విషయం ఏంటంటే? టీడీపీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్ దూరంలో బొమ్ములూరు ఉండడం విశేషం. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.