సాధారణంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే.. అప్పుడప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. లేటవుతుందనే ఉద్దేశంతో.. త్వరగా వెళ్లడం కోసం కొంత మంది రాంగ్ రూట్ లో వెళ్లడం, సిగ్నల్ జంప్ చేయడం వంటివి చేస్తారు. ఇక టూవీలర్స్ అయితే.. ఏ మాత్రం గ్యాప్ దొరికినా చాలు.. ఆ సందులో దూరి ముందుకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో ఏదైనా వాహనానికి ఢీకొడితే.. ఇక రచ్చ ప్రారంభమవుతుంది. ఫలితంగా మరో గంట ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. ఇక డాష్ ఇచ్చిన వ్యక్తి.. దెబ్బ తిన్న వ్యక్తి ఇద్దరు పొట్లాటకు దిగుతారు. వీరి వల్ల మిగతా వారు ఇబ్బంది పడతారు. పోలీసులు వచ్చి.. సర్ది చెప్పే వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది.
ఇలాంటి సంఘటన ఒకటి విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్ల ఇబ్బంది పడ్డ మహిళ.. తన స్కూటీ పక్కకు ఆపి.. బస్సు ఎక్కి డ్రైవర్ తో వాదనకు దిగింది. బస్సు ఇంజన్ మీదకు ఎక్కి.. డ్రైవర్ ని కొడుతు వీరంగం సృష్టించింది. సదరు మహిళను ఆపడం ఎవరి వల్ల కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు సదరు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న తప్పుకు మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా అంటై మహిళను విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి : IAS వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బస్సు తీసుకొని ప్రకాశం రోడ్డులో వెళ్తున్నాడు. ఆ సమయంలో నందిని అనే మహిళ స్కూటీ మీద వెళ్తూ బస్సుకు అడ్డొచ్చింది. దాంతో ముసలయ్య సడెన్ బ్రేక్ వేయగా.. బస్సు మహిళ సమీపంలోకి వెళ్లి ఆగింది. ఈ క్రమంలో బస్సు సదరు మహిళ స్కూటీకి చిన్న డాష్ ఇచ్చింది. ఈ చర్యతో ఆగ్రహించిన మహిళ.. డ్రైవర్పై అరుస్తూ.. బస్సు లోపలికి వెళ్లింది. ఇంజన్ మీదకు ఎక్కి మరీ డ్రైవర్ పై దాడి చేసింది. అతడి చెంప మీద కొట్టడమే కాక.. చొక్కా చింపి.. కాలితో తన్ని వీరంగం సృష్టించింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు.
A woman biker dealt with a city bus driver in #Vijayawada like this, complaining that the bus had hit her bike.
Women passengers in the bus made unsuccessful efforts to convince her to deal with legally.#AndhraPradesh pic.twitter.com/69tgcxzYNw— P Pavan (@PavanJourno) February 9, 2022
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. డ్రైవర్ ను, మహిళను ఇద్దరి స్టేషన్ కు తీసుకెళ్లారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. బస్సులో వీరంగం సృష్టించిన మహిళ.. కేసు నమోదు చేయడంతో వాపసు తీసుకోవాల్సిందిగా డ్రైవర్ కాళ్ల వేళ్లా పడుతూ బ్రతిమిలాడుతుందట. మహిళ, బస్సు డ్రైవర్ పై దాడి చేసిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇది చూసిన వారు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత అతి అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కొడుకు! ఈ తల్లిదండ్రులు చేసిన పనికి సెల్యూట్!