శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం, సోమందేపల్లిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని పుట్టపర్తి సాయిబాబా చిత్ర పటం నుంచి ఏకధాటిగా విభూది రాలుదోంది. అది కూడా కొంచెం కొంచెంగా కాదు.. కుప్పలుగా రాలుతోంది. ఇది చూసిన కుటుంబసభ్యులు, స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్కక్తం చేస్నున్నారు. దైవ పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే.. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని సోమందేపల్లికి జరిగిన ఓ మహిళ పుట్టపర్తి సాయిబాబా పుట్టిన రోజు సందర్భంగా పుట్టపర్తిలో జరిగే నగర సంకీర్తనలో పాల్గొన్నారు.
సంకీర్త అనంతరం నిర్వాహకులు సంకీర్తనలో పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా.. ఓ ఫొటో, విభూది, గాజులు, పండ్లు ఇచ్చారు. ఆ మహిళ నిన్న దాన్ని ఇంట్లోని దేవుడి గూటిలో ఉంచి పూజలు చేసింది. ఈ సందర్భంగా అద్భుతం జరిగింది. ఫొటో నుంచి విభూది రాలటం మొదలైంది. దీన్ని మొదట్లో ఆమె పట్టించుకోలేదు. రాత్రికి మరింత ఎక్కువ విభూది రాలింది. దీంతో ఆ మహిళ సంతోషానికి గురైంది. తనను బాబా కనకరించాడని భావిస్తోంది. తన ఇంట్లో జరుగుతున్న అద్భుతమైన విషయాన్ని చుట్టుపక్కల జనానికి చెప్పి ఆనందిస్తోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ..
‘‘ మేము పుట్టపర్తి సాయిబాబా నగర సంకీర్తనకు వెళ్లాము. ఓ పది మంది వెళ్లాము. అక్కడ నగర సంకీర్తన పూర్తయ్యాక ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదంలో ఓ ఫొటో, విభూది, గాజులు, పండ్లు ఇచ్చారు. అక్కడ తెచ్చిన ఫొటోను బాబా పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో పెట్టి పూజ చేశాను. నిన్న కొద్ది కొద్దిగా విభూది రాలింది. ఏమో అనుకున్నాను. కానీ, నైట్ పూర్తిగా స్వామి ఓ రాశిలాగా తయారు చేశారు. అందుకే అందరికీ చెబుతున్నాను. జన్మ ధన్యం అవుతుంది చూసుకోండి’’ అని చెప్పుకొచ్చింది. కాగా, పుట్టపర్తి సాయిబాబా ఫొటోనుంచి విభూది రాలుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.