తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ దావన్ సెంటర్ లో తాజాగా ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శ్రీహరి కోటలోని సతీష్ దావన్ సెంటర్ లో చింతామణి సీఐఎస్ఎఫ్ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
అయితే సోమవారం ఉదయం చింతామణి చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం చింతామణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లలోపే వికాస్ సింగ్ అనే మరో జవన్ తన గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర కలకలంగా మారుతోంది.
అయితే పోలీసుల విచారణలో మాత్రం వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కారణాలతోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు మరింంత లోతుగా విచారిస్తున్నారు. వికాస్ సింగ్, చింతామణి ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకపోతే వికాస్ సింగ్ స్వస్థలం బీహార్ కాగా, చింతామణి స్వస్థలం ఛత్తీస్ ఘడ్ అని పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.