TTD: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులు దేశ విదేశాలనుంచి తిరుపతి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తమకు తోచిన విధంగా.. ఇష్టపూర్వకంగా విరాళాలు సమర్పింస్తుంటారు. ఇక, తిరుమల శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనవుంతుడైన దేవుడిగా కీర్తి ఘడించారు. ఆయన దగ్గర భారీగా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల వ్యవహారాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. తాజాగా, టీటీడీ తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను ప్రకటించింది.
960 స్థిర, చర ఆస్తులు కలుపుకుని దాదాపు శ్రీవారికి 85,705కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ప్రకటించింది. ఇక, దేశ వ్యాప్తంగా 7123 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు! బ్యాంకుల్లో 14వేల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది. బంగారం విషయానికి వస్తే వివిధ బ్యాంకుల్లో శ్రీవారికి దాదాపు 14 టన్నుల బంగారం ఉందని వెల్లడించింది. అయితే, ఈ 85 వేల కోట్ల రూపాయలు మార్కెట్ విలువ కాకుండా లెక్క కట్టింది. ఒక వేళ మార్కెట్ విలువతో లెక్కకడితే అంతకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఆస్తుల విలువ 2లక్షల కోట్లకు చేరనుంది.
దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ మేము ప్రతి సంవత్సరం శ్రీవారి ఆస్తుల వివరాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని నిశ్చయించుకున్నాం. అనుకున్నట్లుగానే గత సంవత్సరం శ్వేత పత్రం విడుదల చేశాం. ఈ సంవత్సరం కూడా విడుదల చేశాం. ఇప్పటికే దాన్ని టీటీడీ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశాం. భక్తుల భావోద్వేగాలు ముడిపడిఉన్న టీటీడీ విషయంలో పారదర్శకతకు పెద్ద పీఠ వేస్తున్నాం. శ్రీవారి ఆస్తుల సంరక్షణకు కృషి చేస్తున్నాం’’ అని అన్నారు. కాగా, హుండీల ద్వారా టీటీడీకి వచ్చే నెల ఆదాయం గత ఐదు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది.
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు హుండీ ద్వారా టీటీడీకి 700 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. మతాల కతీతంగా కొందరు శ్రీవారిని ఆరాధిస్తుంటారు. తాజాగా, చెన్నైకి చెందిన ఓ ముస్లిం జంట శ్రీవారికి కోటి రూపాయల విలువైన విరాళాలను అందించింది. అంతకు క్రితం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శ్రీవారిని దర్శించుకుని 1.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. మరి, శ్రీవారి ఆస్తుల వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RK Roja: ‘‘బాలయ్య.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు’’: మంత్రి రోజా కౌంటర్