టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే భక్తులకు సంతోషాన్ని కలిగించే ఓ నిర్ణయం టీటీడీ తీసుకుంది.
శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతను ఈ సమావేశం జరిగింది. సుదీర్ఘ సమయం పాటు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకన్నారు. తిరుపతిలోని శ్రీనివాస సేతును త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అలానే ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహాల్లోనే బ్రహ్మోత్సవాలు జరపాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అలానే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే శ్రీవారి లడ్డూ ప్రసాదంకి ఎంతటి ప్రాముఖ్య ఉందో అందరికి తెలిసిందే.ఈ ప్రసాదం విషయంలో కూడా టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏమిటంటే ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే చేయలని నిర్ణయించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేటికాలంలో అందరు ప్రకృతి వ్యవసాయం ద్వారా లభ్యమయ్యే ఆహార పదార్థాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేంద్రియ, ప్రకృతి ద్వారా చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేటికాలంలో ప్రకృతి ఉత్పత్తులపై ప్రజల చూపిస్తున్న ఆసక్తిని టీటీడీ కూడా గ్రహించింది.
దీంతో భక్తులకు కూడా ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డు ప్రసాదాలను అందించాలని నిర్ణయించింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఈ గోడౌన్లు కోల్డ్ స్టోరేజీ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.12 కోట్లు కేటాయిచింది. అలానే తిరుపతి విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా ప్రకృతి వ్యవసాయంపై టీటీడీ పాలకమండలి సానుకూల దృక్పథంతో చూపించడంపై అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.