మనిషి జన్మ అనేది చాలా అరుదైనది. ఇది కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు వంటి వాటితో మిలితమై ఉంటుంది. చాలా మంది కుటుంబమే తమ జీవితంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే భర్త, పిల్లల ఆనందమే తమ సంతోషంగా భావించి.. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోతారు. ఇలా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపుతున్న సమయంలో అనుకోని విషాదాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలో అలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది. ‘పిల్లలూ జాగ్రత్తగా బడికి వెళ్లిరండి’ అని చెప్పిన ఓ మహిళ.. ఆ పిల్లలు వచ్చేసరికి విగతజీవిగా మారింది. తల్లిని నిర్జీవ స్థితిలో చూసిన పిల్లలు భోరున విలపించారు. అమ్మ ప్రేమకు దూరమైన పిల్లలను చూసి స్థానికుల హృదయాలు బరువెక్కాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం ధర్మాచెరువు కాలనీకి చెందిన గీత(30), మోహన్ లు దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. గీత.. ముగ్గురు పిల్లలను రెడీ చేసి పాఠశాలకు పంపేది. అనంతరం తాను పశువులను మేతకు తోలుకెళ్లేది. అలానే మంగళవారం సైతం “పిల్లలూ జాగ్రత్తగా వెళ్లిరండి.. నేను ఆవును మేతకు తోలుకెళ్లి వచ్చేస్తాను” అని చెప్పి తన ముగ్గురు పిల్లలను పాఠశాలకు పంపింది. అనంతరం ఆవులను తోలుకుని మేతకు వెళ్లింది. ఇదే సమయంలో అక్కడ కసవనూరుకు చెందిన గంగిరెడ్డి అనే వ్యక్తి అక్కడే పశువులు మేపుతున్నాడు.
ఆ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు సమీపంలో ఉన్న మామిడి తోటలోని మోటర్ కి కలుపుతూ తీగలు ఉన్నాయి. అయితే అవి ఇటీవల కురిసిన వానాలకు కిందకు వచ్చాయి. ఇది గమనించని గీతా.. పశువులను మేపుతూ వాటి కిందనే కూర్చుంది. కొంత సమయం కూర్చున తరువాత అక్కడి నుంచి వెళ్లేందుకు పైకి లేచింది. దీంతో కిందకు ఉన్న విద్యుత్ తీగలు ఆమెకు తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఇదే సమయంలో ఆమెను కాపాడేందుకు గంగిరెడ్డి సైతం ప్రయత్నించగా.. ఆయనకు కరెంట్ షాక్ కొట్టింది. ఇక మధ్యాహ్ననంకి వచ్చి తన భార్య.. ఇంకా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన మోహనం పొలంకి వెళ్లాడు. అక్కడ గాయపడిన గంగిరెడ్డి, చనిపోయిన గీతను చూసి మోహన్ గట్టిగా కేకలు వేశాడు.
అతడి కేకలు విని చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గంగిరెడ్డిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించగా, గీత మృతదేహాన్ని ఇంటికి తరలించారు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి విగత జీవిగా ఉండటాన్ని చూసి ముగ్గురు పిల్లలు అల్లాడిపోయారు. ‘అమ్మ కావాలి నాన్నా’ అంటూ పిల్లలు ఆ తండ్రిని అడుగుతున్న తీరును చూసి స్థానికుల హృదయాలు బరువెక్కాయి. ఇలా విద్యుత్ ఘటనల కారణంగా ప్రాణాలు పోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.