మన దేశంలో పెళ్లికి ఎంతో మహోన్నతమైన స్థానం ఉంది. పవిత్రమైన వివాహ బంధానికి సమాజంలో ఎంతో విలువ, గౌరవం ఉంది. అదే క్రమంలో పెళ్లైన తరువాత సమాజంలోని కట్టుబాట్లను మరచిపోకుడదు. ఐతే ఈ మధ్యకాలంలో కొందరు వివాహ బంధాన్ని పక్కనపెట్టి, భర్తను కాదని పరాయివాడితో సహజీవనం సాగిస్తున్నారు. పరాయి వాడి మాయలో పడి ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ చివరికి కటకటాల పాలవుతున్నారు. అలానే తాజాగా ఓ మహిళ భర్తను వదిలేసి ప్రియుడితో డేటింగ్ చేస్తుంది. అనుకోకుండా ఓ రోజు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కారణం ఆమె ప్రియుడితో సహజీవనం లో ఉన్నందుకు కాదు. కారణం ఏమిటో తెలుసుకుందాం…
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు సంత రోడ్డులో ఉండే హాలీ మున్నీసా బేగం అనే మహిళ స్థానికంగా బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. భర్తతో విడిపోయిన ఆమె కొంతకాలంగా సాధిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. బ్యూటీషియన్ బేగం ఇంట్లో అకస్మాత్తుగా పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్ దాచిన అర కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బ్యూటీషియన్ ముసుగులో ఆ మహిళ చేస్తున్న గంజాయి దందా గురించి తెలిసి చుట్టుపక్కల వాళ్లు షాకయ్యారు. ఇంతకాలం తమతో పాటు ఉండే వ్యక్తే..గంజాయి సప్లయ్ చేస్తుందనే విషయం పసిగట్టలేకపోయమని అక్కడి వారు తెలిపారు.
కొన్ని రోజుల క్రితమే ఆమె ప్రియుడు సాధిక్ ను గంజాయి కేసులో పోలీసులకు దొరికిపోయాడు. సాధిక్ ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించి విచారించగా కీలక విషయాలు వెల్లడించాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం బ్యూటీషియన్ హాలిమున్నీసా బేగం ఇంట్లో తనిఖీలు చేయగా ఆమె గంజాయి దందా బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.