టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఈ మేరకు శుక్రవారం పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలం గుండుగోలను చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే నిమ్మల ప్రమాదవశాత్తు సైకిల్పై నుంచి కిందపడ్డారు. దీంతో ఎడమ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికి ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్మల తన సైకిల్ యాత్రను మొదలుపెట్టారు.
నిమ్మల తన సైకిల్ యాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘ మేము టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం పది శాతం కూడా పూర్తి చేయలేదు. టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తే వైసీపీలో కదలిక వచ్చి రంగులు వేస్తారు, కానీ పనులు పూర్తి చేయడం లేదు. టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని సైకిల్ యాత్రను ప్రారంభించా. ఈ సైకిల్ యాత్రతో జగన్మోహన్ రెడ్డి కనువిప్పు కలగాలి. జగన్మోహన్రెడ్డి మనసు ఇప్పటికైనా కరుగుతుందేమోనని ఆశిస్తున్నా. లబ్ధిదారులకు కేంద్రం లక్షా ఎనభై వేలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’’ అంటూ నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.