ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరు నెలల్లోనేగా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై తాజాగా సోమవారం నాడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆరు నెలల్లో హైకోర్టును కూడా నిర్మించలేరని.. అలాంటిది రాజధాని నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా ధర్మానసం.. ఏపీ హైకోర్టును ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా.. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా.. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా.. మీరే ప్రభుత్వమైతే రాష్ట్రంలో కేబినెట్ ఎందుకు అంటూ సుప్రీం కోర్టు వరుస ప్రశ్నలు సంధించింది.
అంతేకాక అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కానీ ఈ విషయంలో హైర్టు తన పరిధిని అతిక్రమించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాక రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేము. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేము అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.