బిడ్డల కోసం తల్లి ఎంత కష్టమైన భరిస్తుంది. తాను కరిగిపోతూ.. బిడ్డలు బాగుండాలని కోరుకుంటుంది. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడుతుంది. బిడ్డలు కోలుకుని.. సంతోషంగా తిరగాడిన రోజే ఆ తల్లికి ఊరట. తన వాళ్లకి, ఆఖరికి కట్టుకున్న వాడికి ఏం జరిగినా తట్టుకోగలదు.. ఆ దుఖం నుంచి తేరుకోగలదు. కానీ అదే బిడ్డలకు ఏమైనా అయితే ఆ తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది కంటికి రెప్పలా కాచుకున్న బిడ్డ కనరాని లోకాలకు వెళ్తే.. ఆ తల్లి కడుపుకోత తీర్చడం ఎవరికి సాధ్యం కాదు. ఇక భర్తను కోల్పోయి బిడ్డే లోకంగా బతికే తల్లి.. తన చేతులతో తల కొరివి పెట్టాల్సి వస్తే.. అంతకంటే బాధకరమైన విషయం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇక ఆ తల్లి గుండెకోతను తీర్చడం ఎవరికి సాధ్యం కాదు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. భర్తను కోల్పోయి.. ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోయిన ఆ తల్లిని చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెడతున్నారు. ఈ విషాద సంఘటన వివరాలు..
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన గేదెల మోహన్రావు (24) విశాఖపట్నంలో బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. తండ్రి రమేశ్ తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోగా.. అన్నీ తానై తల్లి ఢిల్లమ్మ కొడుకును పెంచింది. కూలి పనులు చేసుకునే ఢిల్లమ్మకు కొడుకు మోహన్రావు ఆర్థిక అండగా నిలుస్తూ ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ఇంటి పనులు చేస్తుండగా.. భవనం నుంచి జారి కిందపడ్డాడు. దాంతో తలతో పాటు ఇతర భాగాలకూ గట్టి దెబ్బలు తగిలాయి. వెంటనే మోహన్ రావును విశాఖపట్నంలోని కేజీహెచ్లో చేర్పించారు.
ఇది కూడా చదవండి: Anada: ఆలయంలో ఘనంగా ఏనుగు పుట్టిన రోజు వేడుక! వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..
అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్రావు శనివారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామమైన కాపుగోదాయవలస గ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో తల్లి ఢిల్లమ్మే తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది. ఇది చూసిన గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెళ్లిలో ఊహించని సంఘటన.. చరిత్రలో నిలిచి పోతుంది..!