స్మార్ట్ సిటీ దిశగా తిరుపతి దూసుకుపోతుంది. ఒక్కొక్కటిగా పూర్తవుతున్న పలు అభివృద్ది పనులపై నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయిన శ్రీనివాస సేతుని ఈ నెల 16న సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతిలో చేపట్టిన గరుడవారధి ఫ్లైఓవర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వారధి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే నిర్ణయించిన 171 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. కరకంబాడి రోడ్ నుంచి నంది సర్కిల్ కు వెళ్లే రెండో అంతస్తు నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇవే కాక పలు అభివృద్ధి కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోని చూడండి.