ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు తమ మానవత్వం చాటుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పై ప్రమాదానికి గురైన వారిని తమ సొంత కార్లలో ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్య సిబ్బందికి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్నారు. సాధారణంగా వాహనాల్లో వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఏదైనా జంతువులు అడ్డు వస్తే అవి పోయే వరకు ఆపుతుంటారు. అలా డ్రైవర్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. తాజాగా ఏపి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తన మానవత్వం చాటుకున్నారు.
ఏపి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అనుకోకుండా ఒక పాము అడ్డు రాడంతో వెంటనే దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. కంబాల పర్తి గ్రామం దాటుతున్న సమయంలో అక్కడే ఉన్న పొలం లో నుంచి ఒక పెద్ద పాము కారుకు అడ్డం వచ్చింది.. దాన్ని చూసిన డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేశాడు.. దాంతో వెనుక నుంచి వస్తున్న మరో కాన్వాయ్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆయన వాహనం పాక్షికంగా దెబ్బతిన్నది.
తమకు ఎదురుగా వచ్చిన పాము ప్రాణాలు రక్షించడానికి డ్రైవర్ సమయస్ఫూర్తి ప్రదర్శించాడని.. ఆ సమయంలో ప్రమాదం జరగడంతో మ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. ఎవరి ప్రాణాలకు ఏ హానీ కాలేదు. ఏది ఏమైనా వేగంగా వెళ్లి పాముకు ప్రమాదం కాకుండా బ్రేక్ వేసి దాని ప్రాణాలు రక్షించిన డ్రైవర్ ని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మెచ్చుకున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.