ప్రస్తుతం భూమలు విలువకు రెక్కలొచ్చాయి. ఖాళీ స్థలం కనిపిస్తే.. చాలు వదలడం లేదు భూబకాసురులు. వెంటనే కబ్జా చేసేస్తున్నారు. మరి కొందరు రాజకీయనాయకులు అండ చూసుకుని.. ఈ కబ్జా వ్యవహరాల్లో దూసుకుపోతున్నారు. అయితే సామాన్యులకే ఈ కబ్జా కష్టాలు అనుకుంటే.. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో చేరతారు. తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భూకబ్జా బాధితుల జాబితాలో చేరారు. ఆ వివరాలు..
చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో ఆయనకు చేదు అనుభవం ఎదురయ్యింది. గ్రామంలో ఆయన కుటుంబానికి చెందిన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సర్వే నంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉన్న స్థలంలో రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవడంతో పాటు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు.
Vamooo @ncbn gari land kuda kabja cheyadaniki try chesara..🙏🏻🙏🏻😭 half land janam kosam free ga icharu ga ani migilina Sagam memu teskunnam yemi anaru ani logic tho vastaremo YCP fans.. pic.twitter.com/JAD45ecrKw
— Anilchowdary (@anilchowdary81) February 18, 2022
చంద్రబాబు నాయుడి తండ్రి ఖర్జూరనాయుడు 1989లో 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని చంద్రబాబు, రామ్మూర్తినాయుడులకు పంచారు. ఈ క్రమంలో తన వాటాగా వచ్చిన భూమిని ఆస్పత్రి, కల్యాణ మండపానికి చంద్రబాబు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు అదే భూమిలో నారా రామ్మూర్తి నాయుడుకు చెందిన 38 సెంట్లలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. విషయం తెలియడంతో టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చంద్రబాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.