జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్య్సకారుల కోసం నిన్న(ఫిబ్రవరి 20న) రాజమండ్రి నుంచి నరసాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో తమ అధినేతకు జనసైనికులు అడుగడుగున నీరాజనం పలికారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో నిలుచుని ర్యాలీగా వెళ్తున్న సమయంలో దారి అంతా జనసంద్రంగా మారిపోయింది. ఒకానొక సమయంలో జనసేన అధినేత కారుపై నిలబడి అభివాదం చేస్తున్న సమయంలో అభిమాని ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పట్టు తప్పి కింద పడబోయారు. అయితే ఈఘటనలో ఆయనకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్క రూపాయి కూడా పంచకుండా వచ్చిన అభిమానం అది 🙏🙏
Mark my words : His not Politician, Gutsy Leader who came from strggules of Society. @PawanKalyan#JSPForAP_Fishermen #JSPForNewAgePolitics pic.twitter.com/EVlNPk69qE
— Gitam Pawanism (@gitampawanism) February 21, 2022
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్య్సకారుల కోసం చేపట్టిన ర్యాలీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముందుగా రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మీదుగా ర్యాలీగా నరసాపురం వెళ్తున్న సమయంలో జరిగిన ఈ సన్నివేషం అభిమానుల మనసు కొల్లగొట్టింది. ఒక అమ్మాయి.. కారు పైకి ఎక్కి.. జనసేన అధినేతకు హారతి నిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Beautiful moment from today’s event..#JSPForAP_Fishermen#PawanKalyan pic.twitter.com/CQBACghsD5
— Pk3Vk – GnanaVarsha (@DigitallyGV) February 20, 2022
తమ నాయకుడికి హారతి పట్టిన ఈ అమ్మాయి ఎవరంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. జనసేన అధినేతకు హారతి పట్టిన ఆ అమ్మాయి.. రావులపాలెంకు చెందిన జనసేన అభిమాని కూతురిగా తెలుస్తోంది. ఎప్పటినుంచో వారి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న కళాశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి కి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమట. ఇలా తాము ఎంతో ఇష్టంగా ఆదరించే తమ నాయకుడికి హారతి పట్టడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఒక వీర మహిళ, ఈ అమ్మాయి ఇచ్చిన హారతి విజయానికి నాంది కావాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.