నందమూరి నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన వైకాపా ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ది శూన్యం గా ఉందని, ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమాలు, ఏపీ లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నాకు 60 ఏళ్లు అంటే వాడికి దబిడి దిబిడే అని హెచ్చరించారు. చదువుకుంటున్న సమయంలో తనను ఎన్టీఆర్ సినిమాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. సినిమాల్లో రాణించలేకపోతే ఉద్యోగం చేసుకోగలనని ఆయన అన్నారు. అలానే వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని ఆరోపించారు. ఒకవైపు కొత్త పరిశ్రమలు రాకుంటే.. మరొకవైపు ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెల్లగొడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తుందని అన్నారు. ఈ రాక్షస పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని బాలకృష్ణ హమీ ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామంటూ బాలకృష్ణ వ్యాఖ్యనించారు. మరి.. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి