ఏపీ రాజకీయాలలో మినిస్టర్ రోజా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మంత్రి రోజాని పాచినోరు అన్న పవన్.. ఆ తర్వాత యువశక్తి సభలో డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి.. మంత్రులకు శాఖలు తెలియవంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో మంత్రి రోజా ఓవైపు పవన్ పై కౌంటర్స్ వేస్తూనే.. కమెడియన్ హైపర్ ఆది మాటలపై స్పందించింది.
ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ ప్యాకెజీ స్టార్ అని.. చంద్రబాబు దగ్గర కలెక్ట్ చేసుకోవడానికే వెళ్ళాడు. జగన్ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టే.. ప్రజలు మమ్మల్ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ ఎందుకని ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు?” అని చెప్పింది. ఆ తర్వాత కమెడియన్ హైపర్ ఆది మాటలపై స్పందిస్తూ.. ‘హైపర్ ఆది చిన్న ఆర్టిస్టు. చిన్న చిన్న షోలు.. క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉంటారు. వారిని ఎవరో భయపెట్టి అలా మాట్లాడించారు. చిన్న ఆర్టిస్టులు ఎప్పుడూ అలా అనరు. అలా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో ఉండనివ్వం అని ఎవరో భయపెట్టి అలా మాటలు అనిపించారు.
ఇంకా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పెద్దది. కాబట్టి.. ఆ ఫ్యామిలీతో విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో.. వెనుక నుండి ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తున్నారు పాపం. వారు మాట్లాడింది అభిమానంతో కాదు భయంతో.. ఇలా భయంతో ఎప్పటికీ ఎక్కువ కాలం బ్రతకలేరు. మంత్రులకు శాఖలు తెలియవంటే.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శారదా, నేను ఎలా గెలిచాం. మేము సినిమా వాళ్ళమే కదా! ప్రజలకు మా వల్ల మంచి జరిగింది.. కాబట్టి మమ్మల్ని గెలిపించారు. అదే జనాలు మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు? ఎవరు ఎలాంటివారో జనాలకు తెలుసు” అని చెప్పుకొచ్చారు రోజా. ప్రస్తుతం రోజా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రోజా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.