గత కొన్ని రోజులుగా ఏపిలో మూవీ టికెట్స్ విషయం పై రగడ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధర తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తోందని, థియేటర్ కంటే కిరాణా షాపుల్లోని కలెక్షన్స్ నయం అంటూ హీరో నాని పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే హీరో నాని చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా హీరో నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..” సినిమా ఖర్చులో 80 శాతం రెమ్యునరేషన్కు వెళ్తుంటే, అసలు ఖర్చు 20 శాతమే. ఆ 80 శాతాన్ని కూడా ప్రేక్షకులపై రుద్దడం ఏంటి. టికెట్ ధర తగ్గితే.. రెమ్యునరేషన్ తగ్గుతుందని వాళ్ళ బాధ. భీమ్లా నాయక్ ,వకీల్ సాబ్ కి పెట్టిన ఖర్చెంతో తెలపాలి. వకీల్సాబ్, భీమ్లానాయక్ తీసిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలి. పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా. తనకున్న క్రేజ్ ను పవన్ సినిమాల రూపంలో అమ్ముకొంటున్నారు. ఒకప్పుడు నేను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ కి కటౌట్ లు కట్టినాను. ఉన్న డబ్బులు ఊడగొట్టుకున్నా.. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే. ప్రొడక్షన్ ఖర్చు 30 శాతం అయితే రెమ్యునరేషన్ 70 శాతం ఉంది” అంటూ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.