ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం గుంటూరు జిల్లా వినుకొండలోని గురుకుల పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం బాలయోగి గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లాల్సిన మంత్రి సురేష్.. నేరుగా అక్కడికి వెళ్లకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆఖస్మిక తనిఖీ చేశారు. ఆ తరవాత బాలయోగి గురుకుల పాఠశాలను సందర్శించారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆఖస్మిక తనిఖీ చేసిన ఆయన అక్కడి సిబ్బందితో పిల్లలకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తున్నారని.. వారి విద్యా, ఆరోగ్య విషయంపై ఆరా తీశారు. తరగతి గదులను పరిశీలించి విద్యాబోధన తీరును పిల్లలను అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని విద్యార్థినులతో కాసేపు ముచ్చటించిన మంత్రి సురేష్.. వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు.
ఇది చదవండి : ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సత్యరాజ్
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన సురేష్.. ప్లేటును కూడా స్వయంగా కడిగారు. భోజనం బాగుందని.. తయారుచేసిన వంట సిబ్బందితో మాట్లాడారు. వంట గదిని పరిశీలించారు. అయితే అక్కడి వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.