కలియుగ దైవంగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని భక్తులు కొలుస్తారు. ప్రపంచ నలుమూల నుంచి స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. విదేశాల్లో సైతం శ్రీవారి అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేశాల్లో వేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పినారు. ఇప్పటి దాకా ప్రపంచంలో అతిపెద్ద వేంకటేశ్వరస్వామి విగ్రహం మారిషస్ లో నిర్మిచారు. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. ఈ క్రమంలోనే తాజాగా అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది.
ప్రపంచంలో ఎత్తైన వేంకటేశ్వర స్వామి విగ్రహాం ఉన్న ప్రాంతంగా విశాఖ నిలవనుంది. 125 అడుగుల ఎత్తులో ఈ స్వామి వారి విగ్రహం ఏర్పాటు కానుంది. దీనికి టీటీటీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాల అందిచనుంది. దీంతో వేంకటేశ్వర స్వామి ఎత్తైన విగ్రహం చూసి ఆనందించే భాగ్యం విశాఖ వాసులకు కలగనుంది. అంతేకాదు విశాఖకు వచ్చి పర్యాటకులకు కూడా ఈ భారీ విగ్రహం కనువిందు చేయనుంది. దీనికి సంబంధించి విశాఖలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ట్రస్ట్ వారు విగ్రహాన్ని స్థాపించేందుకు ముందుకు వచ్చింది.
ట్రస్ట్ వారు ఈ విషయంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు. దానికి సమాధానంగా టీటీడీ తన వంతుగా పూర్తి సాయం చేస్తుందని తెలిసింది. స్థలం కోసం జిల్లా కలెక్టర్ కి టీటీడీ లేఖ రాసింది. మూడు ఎకరాల స్థలం విగ్రహం ఏర్పాటుకు కేటాయించాలని టీటీడీ కోరినట్లు తెలుస్తోంది. భారీ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహంతో పాటు పరిసర ప్రాంతాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.