ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ స్థాయికి మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మాటలు కూడా సరిగా రాని చిన్నారులను తీసుకెళ్లి ఖరీదైన స్కూళ్లలో వేస్తున్నారు. మధ్యతరగతి, పేద ప్రజలు తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. పిల్లల చదువు కోసం అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక డబ్బున్న వారి పిల్లలు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవారి గురించి ప్రత్యకంగా చెప్పనక్కరేలేదు. అతను ఒక జిల్లాకు కలెక్టర్ అయినప్పటికీ తన పిల్లలను మాత్రం అంగన్ వాడి స్కూల్ లో చేర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే..
కర్నూల్ జిల్లా లో కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు పి.కోటేశ్వరరావు. ఆయనకు నాలుగు సంవత్సరాల దివి అర్విన్ అనే బాబు ఉన్నారు. తన కొడుకును లక్షలు వెచ్చించి కార్పోరేట్ చదువు చెప్పించడం కన్నా.. ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి అందరికి ఆదర్శంగా ఉండాలని కోరుకునేవారు. తన ముద్దుల తనయుడు దివి అర్విన్ ని అంగన్వాడీ స్కూల్ లో చేర్పించాడు. ఆ చిన్నారి కూడా అంగన్వాడీ సెంటర్ లోని ఇతర పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభుత్వం నిర్వహించే అంగన్ వాడి సేవలు అందరు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
ఇప్పుడు అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలను ఎంతో చక్కగా చూసుకుంటున్నారని.. ప్రీ స్కూల్ పిల్లలకు పుష్టకరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు మంచి విలువలు కూడా నేర్పిస్తున్నారని అన్నారు కలెక్టర్. ఈ విషయాల గురించి ఆయన ఇటీవల జరిగిన మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో మాట్లాడారు. అందుకే తన కొడుకును అంగన్ వాడీ స్కూల్ లో చేర్పించినట్లు తెలిపారు. ప్రజలకు చెప్పడం కాదు.. తాను ఆచరించి చూపించాని అన్నారు.
ఒక ఉన్నతమైన హూదాలో ఉండి కూడా తన కుమారుడిని సామాన్యుడిగా అంగన్ వాడీ స్కూల్ లో చేర్పించడంపై ఎంతో గొప్ప విషయం అని పలువురు ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలను అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించేందుకు ఉత్సహాం చూపిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.