Kedareswara Rao: మనం మనస్పూర్తిగా చేసిన పని, పడ్డ కష్టం ఎప్పుడూ వృధాకావు. ఎప్పుడోఒకప్పుడు వడ్డీతో కలిపి మరీ ప్రతి ఫలాన్ని ఇస్తాయి. ఒక్కోసారి మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం రావటం కాస్త లేటు కావచ్చు. కానీ, రావటం మాత్రం పక్కా. ఇందుకు తాజా ఉదాహరణే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేదారేశ్వరరావు. పాతపత్నం మండలం సీది గ్రామానికి చెందిన ఆయన 1994లో డీఎస్సీ రాయగా స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. అయినా కుంగిపోలేదు. ఈ సారి మరింత కష్టపడి చదివారు. 1998లో డీఎస్సీ రాశారు. అయితే, వివాదాల కారణంగా ఫలితాలు వెలువడలేదు. కుటుంబ ఆర్థికపరిస్థితులు, తల్లిదండ్రుల మరణం, ఇతర కారణాలతో భిక్షగాడిగా మారారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత అతడ్ని అదృష్టం వరించింది. పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. ఇటీవల డీఎస్సీ-1998 క్వాలిఫై అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ సీఎం జగన్.. దానికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేసిన సంగతి తెలిసిందే.
ఆ 1998 డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. తనకు ఈ విషయం తెలియదని, 23 ఏళ్లు గడిచిపోయాయంటూ కేదారేశ్వరరావు చింతించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 55ఏళ్లు. ఈలేటు వయసులో ఉద్యోగం రావటంపై ఒక వైపు సంతోషంగా ఉన్నా.. మరో వైపు బాధపడ్డారు. కేథారరేశ్వరరావు డీఎస్సీ కొట్టిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీంతో అతడి పరిస్థితి చూసి చలించిపోయిన స్థానికులు సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. బిక్షగాడిగా ఉన్న ఆయన వేషధారణను పూర్తిగా మార్చేశారు. మంచి దుస్తులు, పాదరక్షలు, కొత్త ఫోన్, కొంత డబ్బు ఇచ్చారు. సోమవారం ఆయనకు ఘనంగా సత్కారం చేశారు. కేకు కోసి ఆయనకు తినిపించారు. ఈ సందర్భంగా ఊర్లోని తన పాత ఇంట్లో ఉన్న తన సర్టిఫికేట్లను, 1998లో జరిగిన డీఎస్సీ పరీక్ష హాల్ టిక్కెట్ను కూడా వారికి చూపించాడు. మరి, కేథారేశ్వరరావు స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : APలో అద్భుతం! 23 ఏళ్ళ తరువాత బిచ్చగాడిని వరించిన అదృష్టం!