ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ తెగ హల్ చల్ చేస్తున్నారు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ‘ప్రజాశాంతి’ అనే పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు కేఏ పాల్. ప్రస్తుతం ఆయన ఎక్కువగా తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.. ఇందుకు కారణం వరుసగా టూర్లు వేయడం. ఒక రకంగా చెప్పాలంటే కేఏ పాల్ ను పొలిటికల్ లీడర్ గా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేసే వ్యక్తిగానే కొంతమంది భావిస్తున్నారు. పవన్ పై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాన్ కి ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉందని, అందుకే చంద్రబాబు ఆయనపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాన్ కొత్త ఆప్షన్ పెట్టుకోవాలని అదే ప్రజాశాంతి పార్టీలో చేరడమని అన్నారు. 2024 లో ప్రజాశాంతి పార్టీ తరుపున 42 ఎంపీ సీట్లు గెలిపిస్తే.. ప్రధాన మంత్రిగా తాను పదవిలోకి వస్తానని.. నేను పీఎం అయితే ఆంధప్రదేశ్ కి పవన్ కళ్యాన్ ని సీఎం చేస్తానని అన్నారు. రాష్ట్రానికి ఏదైనా చేయాలని చిత్తశుద్ది ఉంటే.. జనసైనికులు ప్రజాశాంతిలో చేరాలని.. ఇక సీఎంగా పవన్ మాత్రమే ఉంటారని అన్నారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: ఇంటర్మీడియట్ లోనే ప్రేమలో పడింది! పెళ్లికి ప్రియుడు నిరాకరించాడని!
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కేఏపాల్ ను జనసైనికులు ఆటాడేసుకుంటున్నారు. తమదైన మీమ్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
4th Option For Pawan Kalyan 😂 pic.twitter.com/bLSJBTFhjY
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) June 5, 2022