కర్ణాటక లో ప్రారంభమైన హిజాబ్ వివాదం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించి వచ్చిన కొందరు విద్యార్థులను కాలేజీలోకి అనుమతించకపోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన నిర్వహించగా.. తాజాగా ఏపీలో అందుకు పూర్తి విరుద్ధమైన దృశ్యం కనిపించింది. విజయవాడలోని ఓ కాలేజీ యాజమాన్యం.. హిజాబ్ ధరించి వచ్చినందుకు విద్యార్థులను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వివాదం రేగింది. ఆ వివరాలు..
విజయవాడ లయోలా కాలేజీలో హిజాజ్ వివాదం తలెత్తింది. హిజాబ్ వేసుకొచ్చినందుకు ఇద్దరు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులను సెక్యూరిటీ గేటు వద్ద ఆపేశారు. తాము ఫస్టియర్ నుంచి కాలేజీకి హిజాబ్ ధరించే వస్తున్నామని.. వారు తెలిపారు. ఇవాళ కొత్తగా ఇలా అడ్డగించడం ఏంటని ప్రశ్నించారు. పైగా తమ ఐడీ కార్డుల్లో కూడా హిజాబ్ తోనే ఫోటో దిగామని తెలిపారు. ఈ విషయం కాస్త విద్యార్థినిల తల్లిదండ్రులకు తెలియడంతో.. వారు మతపెద్దలతో పాటు కాలేజీ వద్దకు చేరుకుని.. దీనిపై ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. విషయం తెలిసి పోలీసులు సైతం కాలేజీ వద్దకు చేరుకున్నారు.
ఇది కూడా చదవండి : హిజాబ్ కి మద్దతుగా హైదరాబాద్ లో ఆందోళనలు!
ప్రిన్సిపాల్ తో తల్లిదండ్రులు, పోలీసులు మాట్లాడిన తర్వాత విద్యార్థినిలను హిజాబ్ తోనే కాలేజీలోకి అనుమతించారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం తాజాగా విజయవాడలో కూడా చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.