హీరో అక్కినేని సుమంత్.. నాగేశ్వరరావు మనవడిగానే కాక.. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి నటుడిగా నిరూపించుకున్నప్పటికి.. కెరీర్ లో మాత్రం ఆయన అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సుమంత్ హీరోగా ‘మళ్లీ మొదలైంది’ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు టీం. సినిమా రిలీజ్ సందర్భంగా సుమంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, సుమంత్ చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే.
ఇక తాజా ఇంటర్వ్యూలో సుమంత్ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే రోజుల నుంచే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. మేం ఇద్దరం మంచి స్నేహితులం. తను స్కూల్ డేస్ లో నాతో ఎలా ప్రవర్తించేవాడో.. ఇప్పుడు కూడా అలానే ఉంటాడు. మేం చదువుకునే రోజుల నుంచే.. నేను తనను గమనించేవాడిని. ఈ రోజు తను ఏపీ సీఎం అయ్యాడు. అయితే తాను రాజకీయాల్లో మంచి పొజిషన్ కు వెళ్తాడని.. నేను ముందే ఊహించాను. నా నమ్మకం నిజమైంది. ఈ రోజు తను ఏపీ సీఎం అయ్యాడు. తన గురించి నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ఊహించానో.. జగన్ అదే రుజువు చేశాడు’’ అని తెలిపాడు సుమంత్.
సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి సౌందర్ రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, డైవోర్స్ కేసులో తన తరఫున వాదించిన న్యాయవాదితో ప్రేమలో పడితే.. అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సినిమాలో పెళ్లి కార్డుని సోషల్ మీడియాలో లీక్ చేయడంతో సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్సేనని, సినిమా ప్రమోషన్స్లో భాగంగానే అలా చేశారని చివరకు తెలిసింది. ‘మళ్లీ మొదలైంది’ చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీ5లో ఫిబ్రవరి 11న ప్రసారం కానుంది. సుమంత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.