కర్నూల్ జిల్లాకు నూతన ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎస్టీగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ రెడ్డిని కోనసీమ జిల్లాకు ట్రాన్స్ వర్ చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఎస్పీలు బదిలీ కావడంపై చర్చలు కొనసాగుతున్నాయి.
కర్నూల్ జిల్లాకు నూతన ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఆయనకు అభినందనలు తెలిపారు. తాను కర్నూల్ జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించానని సిద్దార్ధ్ కౌశట్ ట్విట్ చేశారు. దీనికి రీ ట్విట్ చేసిన గోపిచంద్ మలినేని కంగ్రాచ్యులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ సర్ అంటూ కామెంట్ పెట్టారు. సిద్దార్థ్ కౌశల్ ఇప్పటికే రెండు మూడు జిల్లాలకు ఎస్పీగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. కౌశల్ బదిలీపై దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందించడం విషయంపై ఆసక్తి రేపుతుంది.
Congratulations n best wishes sir 👍 https://t.co/b6yDXWh4c7
— Gopichandh Malineni (@megopichand) June 23, 2022