Kommu Konam Fish: చేపల వేటకు వెళ్లిన ఆ జాలర్లకు సిరుల పంట పండింది. అరుదైన కొమ్ము కోనం చేపలు వారి వలలకు చిక్కాయి. వాటిని వేలం వేయగా కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కాకినాడ, యూ కొమ్ముపల్లి మండలం, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో వల వేసి చేపల కోసం వేచి ఉన్నారు. కొంత సేపటి తర్వాత చేపలు వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. అయితే, వలలను పైకి తీసి చూడగా వారు ఊహించని ఘటన చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో మాత్రమే దొరికే అత్యంత అరుదైన కొమ్ముకోనం చేపలు వారి వలలకు చిక్కాయి. చిన్నాచితకాగా కాదు.. ఏకంగా 13 టన్నుల చేపలు వలలో చిక్కాయి. వాటిని ఒక్క బోటుతో తరలించటం వారి వల్ల కాలేదు. అందుకోసం ఇంకో బోటును రంగంలోకి దింపారు.
రెండు బోటుల్లో చేపల్ని నింపుకుని ఒడ్డుకు చేరారు. ఈ చేపల్ని వేలం వేయగా భారీ ధర పలికాయి. ఏకంగా కోటి 20లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి. దీంతో మత్స్యకారుల సంతోషానికి హద్దులు లేకుండాపోయింది. సాధారణంగా ఈ చేపలు వందల అడుగుల లోతులో ఉంటాయి. అలాంటివి మత్స్యకారుల వలలో పడటం అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఈ కొమ్ముకోనాలకు బెంగళూరు, చెన్నై, కోల్కతాలో భారీ డిమాండ్ ఉంది. మరి, మత్స్యకారులకు సిరుల పంట పండించిన కొమ్ముకోనం చేపలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏపీ కేబినెట్ ఆమోదం..!