ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారు. నేడు ఆయన జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేసి విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శ్రీ సత్యసాయి జిల్లాలో నిరసన సెగ తగిలింది. సీఎం జగన్ బయలు దేరిన హలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో నార్పలలో హెలికాఫ్టర్ ని ఆపివేశారు. నార్పల నుంచి బస్సు ద్వారా సీఎం జగన్ పుట్టపర్తికి రోడ్డు మార్గాన బయలుదేరారు. ఇదే సమయంలో ఆయనకు తుంపర్తి భూ నిర్వాసితులు అడ్డుకుని నిరసనలు తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన కాన్వాయ్ ని అడ్డుకొని రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు సీఎం జగన్ బయలు దేరిన హెలికాప్టర్ కి టెక్నికల్ ఇబ్బంది తలెత్తడంతో ఆయన నార్పల నుంచి బస్సు ద్వారా పుట్టపర్తి ఎయిర్ పోర్టు కి బయలుదేరారు. సీఎం రోడ్డు మార్గాన బయలుదేరిన విషయం తెలుసుకున్న తుంపర్తి గ్రామంలోని రైతులు రోడ్డుపైకి వచ్చి జగన్ లేఔట్ కి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆందోళన చేశారు. తమకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. భూములు కోల్పోయి కూలీలుగా పని చేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు.
జగన్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై భైఠాయించారు. అప్పట్లో తమకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు.. ఇప్పుడు ముఖం చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆఫీసుల వెంట తిరిగి అలసిపోాయాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పక్కకు నెట్టేసి సీఎం కాన్వాయ్ ని పోలీసులు పంపించి వేశారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉత్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.