ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు దేశంలో మిగిలిన రాష్ట్రాల రాజకీయాలకు కాస్తా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అధికార ప్రతి పక్షాల మధ్య నిత్యం మాటల యుద్దం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే టీడీపీ తరపున ఎవరు ఆరోపణలు, కామెంట్స్ చేసిన..అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై విరుచుక పడుతున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, చంద్రబాబు , లోకేశ్ ల తాట తీస్తామని హెచ్చరించారు.
గురువారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేశ్ లు తనపైకి రావాలని, మహిళలను అడ్డు పెట్టుకుని దిగజారుడు రాజకీయాలోద్దని హెచ్చరించారు. నాడు లక్ష్మి పార్వతిని అడ్డం పెట్టి ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచాడని, భార్యను అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ అల్లుడిగా రాజకీయాల్లో ఎదిగి, చివరకు లోకేశ్ కు పేరు రావడానికి ఎన్టీఆర్ మనుమరాలితో పెళ్లి చేశాడని కొడాలి నాని అన్నారు. వారిద్దరిది అడ్రస్ లేని బతుకులని, ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఎదిగారని ఎద్దేవా చేశారు. గన్ మెన్లను పెట్టుకుని, తనకు సెక్యూరిటీ చాలదు అని కేంద్రానికి లేఖలు రాసుకుని 12 మంది, 24 మందికి పెంచుకుని పిల్లిలాగా బ్రతికే బతకు నీది. జగన్ మోహన్ రెడ్డి ది కాదు. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది.
వార్డు మెంబర్ గా గెలవలేని లోకేశ్ కు చంద్రబాబు మంత్రిని చేసినా లాభంలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని కొడాలి నాని ఫైర్ అయ్యారు. తండ్రి, కొడుకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరి.. కొడాలి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.