మనం నిత్యం అనేక రకాల చేపలను చూస్తూంటాము. వాటిని చూస్తుంటే మనసుకు ఆహ్లదకరంగా ఉంటుంది. కాని కొన్ని రకాల చేపలు మాత్రం చూడటానికి క్యూట్ గా కనిపించిన.. అవి చాలా ప్రమాదకరం. అలాంటి వాటిలోని మనిషి ముఖాన్ని పోలిన చేప ఒక్కటి జాలర్ల కంటపడింది. అరుదుగా కనిపించే మనిషి రూపం పోలిన ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. ఈ చేప నీటిలో ఉన్నప్పుడు అన్నిచేపలలానే ఉన్న తనను తాకితే మరో రూపం చూపిస్తుంది. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పల గుప్తం మండలం వాసాలతిప్ప గ్రామానికి చెందిన జాలర్ల చేతికి చిక్కింది. మరి.. ఆ బొంక చేప గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి మోమును పోలిన రూపంతో కనిపిస్తున్న ఈ చేపను పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది టెట్రాడాంటిడీ కుటుంబానికి చెందిన చేప ఇది. ఇది మిగిలిన చేపలానే ఉన్నా.. తనకు ప్రమాదం ఉందని తెలిస్తే తనలోని విషయాన్ని ప్రయోగిస్తుంది. ఎవరైనా తాకినా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలిపిల్చుకుని బంతిలా ఉబ్బుతుంది. ప్రపంచంలో అతి రెండో విషపూరితమైన చేప ఈ బొంక చేప. దీనిలో మనిషిని చంపేత విషయం ఉంటుందని ఉప్పలగుప్తం మండల మత్స్యశాఖ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. ఇది ఇటివల తూర్పుగోదావరి జిల్లా వాసాల తిప్ప తీరంలో మత్స్యకారుల వలకు చిక్కింది. అందుకే ఇలాంటి చేప మీకు ఎప్పుడైనా కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి.మరి.. ఈ చేపపై మీ అభిప్రాయాలను కామెంట్స్ర రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.