సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
నారాయణ సతీమణి వసుమతి కన్నుమూసిన విషయం విషయం తెలుసుకున్న పలు పార్టీల నేతలు నారాయణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. వసుమతి మరణం సీపీఐ శ్రేణుల్లో విషాదం నింపింది.