వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన 50వ పుట్టిన రోజును జరపుకోనున్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నాయకులు, మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడాపోటీలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతేకాదు.. లక్ష మందికి పైగా రక్తదానం చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు.
ఈ వారం ఆరంభంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (IRCS)తో కలిసి రక్తదానం చేసేందుకు పూనుకుంది. ఇది జరిగిన 72 గంటల్లోనే లక్ష మందికి పైగా రక్తదానం చేసి.. ఐఆర్సిఎస్ నుండి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. బ్లడ్ డొనేషన్ డ్రైవ్ రేపు కూడా కొనసాగనుంది. గతంలో సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా 38 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు నెలకొల్పారు. ఈసారి మరింత వినూత్నంగా రక్తదాతల నుంచి ప్లెడ్జ్ ఫారమ్స్ సేకరించి రోగులకు అత్యవసరమైన సందర్భాల్లో రక్తం అందించే విధంగా చేస్తున్నారు. రక్తదానం చేయడానికి సుముఖంగా ఉన్న వారికోసం ysrcpblooddonation.com వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులను చూశాం మీలాంటి మంచి మనసున్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం.#HBDYSJagan pic.twitter.com/f5tqi6YwO0
— YSR Congress Party (@YSRCParty) December 20, 2022
కాగా, సీఎం జగన్ యాభై పుట్టిన రోజు వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు, మద్దతుదారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగనన్న స్వర్ణోత్సవ సంబరాల పేరిట కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మంత్రి రోజా ఆధ్వర్యంలో ఇవి సాగుతున్నాయి. కార్యక్రమం జరుగుతున్న ప్రతీ చోటా ఆమె డాన్సులు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పథకాల లబ్ధిదారులు ‘ప్రజా నాయకుడు’ సీఎం జగన్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ వారి చిత్రాలు, వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
రక్తదానం చేద్దాం.. ప్రాణ దాతలుగా నిలుద్దాం#YSRCPBloodDonation #AdvanceHBDJagananna
రక్తదానం చేయాలనుకున్న వారు వెబ్సైట్లో https://t.co/ZHjaND8SRF లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. pic.twitter.com/9RRT0gBS8a
— YSR Congress Party (@YSRCParty) December 16, 2022