దేశాన్ని ఏలే రాజైనా.. అమ్మకు బిడ్డే అంటారు. బిడ్డ ఎంత గొప్పగా ఎదిగినా.. తల్లిదండ్రులకు చిన్నవాడిలానే కనిపిస్తాడు. వారి కోసం నిత్యం ఆలోచిస్తారు.. ప్రతిక్షణం పరి తపిస్తారు. బిడ్డలు జీవితంలో విజయం సాధిస్తే.. తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. పదుగురితో పంచుకుని సంబరపడతారు. ఇక తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్లైనా సరే.. తమ బిడ్డల విషయానికి వస్తే.. అందరిలానే ప్రవర్తిస్తారు. విజయం సాధిస్తే ఉప్పొంగిపోతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సంతోషాన్నే అనుభవిస్తున్నారు. కుమార్తె సాధించిన విజయాన్ని తల్చుకుని పొంగిపోతున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె యెదుగూరి సందింటి హర్షిణి రెడ్డి ఫ్రాన్స్లోని ఇన్సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్లో మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి రెడ్డి ప్యారిస్ వెళ్లారు. ఈ కార్యక్రమం శనివారం జరిగింది. గ్రాడ్యూయేషన్ సెర్మనీ పూర్తయిన తర్వాత సీఎం జగన్ తన కుమార్తె సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కరోనా టెన్షన్.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్!
‘‘డియర్ హర్ష.. నీ ఎదుగులను చూస్తూ సాగిన ఈ ప్రయాణం ఎంతో అద్భుతం. ఇదంత దేవుడి అపరిమత కృప. ఇన్సీడ్ (INSEAD) లాంటి గొప్ప ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వు డిస్టింక్షన్లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకోవడం.. డీన్స్ జాబితాలో నీ పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. దేవుడి కృప నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
ఇది కూడా చదవండి: Kodali Nani: వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని కీలక వ్యాఖ్యలు!
హర్షిణి రెడ్డి మొదట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్లో మరో అత్యున్నతమైన యూనివర్శిటీ అయిన ఇన్సీడ్లో మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సులో చేరారు. కరోనా మొదటి విడత లాక్ డౌన్ పూర్తయిన తర్వాత చదువు కొనసాగించేందుకు హర్షిణి రెడ్డి ప్యారిస్ వెళ్లారు. సీఎం జగన్ బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు గ్రాడ్యూయేషన్ పూర్తి కావడంతో ఆ వేడుకల్లో .. కుమార్తె సంతోషాన్ని పంచుకునేందుకు వెళ్లారు. కుమార్తె సాధించిన విజయం పట్ల భావోద్వేగానికి గురవతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. అలానే కుమార్తె విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. వైఎస్ భారతి షేర్ చేసిన వీడియో కూడా వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Balakrsihna: సీఎం జగన్ కు సమస్యలా మారిన బాలకృష్ణ! ఇదేమి క్రేజ్ స్వామి?