ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. భారత్లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారని వివరించింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. అంతే కాదు పలు రాష్ట్రాలకు కీలక సూచనలు కూడా ఇస్తుంది. ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష ని నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
రాష్ట్ర వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని.. వ్యాక్సినేషన్లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు. ఇక పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సమీక్షా సమావేశంలో నైట్ కర్ఫ్యూపై పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడంపై చర్చ జరుగుతుండవొచ్చని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్లలో స్పెషల్ మెడికల్ టీమ్స్ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయడంపై దృష్టిసారించే విషయం.. రాష్ట్రంలో అందరూ మాస్క్లు ధరించేలా చర్యలు చేపట్టి మళ్లీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించే విషయం చర్చల్లో ఉండబోతున్నట్లు సమాచారం. ఏపిలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.