ఓ కుటుంబం, సమాజం, మొత్తంగా దేశం అభివృద్ది చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది విద్య. అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞాన జ్యోతులు వెలిగించే శక్తి అక్షరానికి ఉంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. కానీ విద్యాదానం దాని కన్నా గొప్పది. అన్నం పెడితే ఆ పూట కడుపు నిండుతుంది. అదే విద్యాదానం చేస్తే.. అది అన్నం సంపాదించుకునే మార్గం చూపుతుంది. గురువును దైవంగా భావించే సమాజం మనది. రాజుకు లేని గౌరవం గురువుకుండేది. అంత గొప్ప స్థానం సంపాదించుకున్న విద్యావ్యవస్థ.. క్రమంగా తన ప్రభావం కొల్పొసాగింది. ఇక విద్యారంగంలో కూడా ప్రైవేటు వారు ప్రవేశించడంతో… దైవ స్వరూపం అయిన విద్య కూడా వ్యాపారం అయ్యింది. ఫలితంగా ‘‘చదువుకునే స్థాయి’’ నుంచి ‘‘చదువుకొనే స్థాయి’’కి పరిస్థితులు మారాయి. పాలకులు కూడా తమ స్వలాభం చూసుకుని ప్రభుత్వ బడులను చిన్న చూపు చూశారు.
ఫలితంగా గత 40 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఇక ఆఖరికి ప్రభుత్వ పాఠశాల అంటే బందెల దొడ్డి అనే స్థాయికి తీసుకువచ్చారు గత పాలకులు. తగినంత మంది సిబ్బంది ఉండరు.. వసతులు సరిగా ఉండవు. దాంతో విధిలేక చాలా మంది పేద, మధ్యతరగతి జనాలు అప్పులు చేసి మరి తమ బిడ్డలను ప్రైవేటు పాఠశాలలకు పంపసాగారు. ఆ ఖర్చును భరించలేక.. మధ్యలోనే పిల్లలను చదువు మాన్పించిన వారు కూడా ఉన్నారు.
అయితే సీఎం జగన్ చూపిన చొరవ కారణంగా నేడు ప్రభుత్వ పాఠశాలకు మహార్దశ పట్టింది. 2014 ఎన్నికల తర్వాత సీఎం జగన్ మహాపాదయాత్ర చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరిగారు. ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. పాదయాత్రలో చాలా చోట్ల ఓ దృశ్యం పదే పదే రిపీట్ అవుతోంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ దుస్థితి చూసి చలించిపోయారు జగన్. చాలా చోట్ల బడుల్లో సరైన వసతులు లేవు.. పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలతో నిండిన ప్రాంగణాలు, శిథిలావస్థకు చేరుకుని.. కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు.. చెట్ల కింద పాఠాలు, ఇష్టారీతిగా తిరుగుతున్న పిల్లలు. వీటన్నింటిని గమనించిన సీఎం జగన్ ఈ పరిస్థితులను మార్చాలని నిర్ణయించుకున్నారు.
ఇక పాదయాత్రలో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారం భరించలేకపోతున్నామని.. ఎలాగైనా తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందే మార్గం చూపమని వేడుకున్నారు. ఇక చాలా మంది యువత.. తమకు టాలెంట్, మంచి మెరిట్ ఉన్నప్పటికి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ప్రయాత్నాల్లో విజయం సాధించలేకపోతున్నమని తెలిపారు. వీరి సమస్యలను స్వయంగా చూసి తెలుసుకున్న జగన్.. ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో విజయం సాధిస్తే వీటికి పరిష్కారం చూపాలని భావించారు.
అనుకున్నట్లే.. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టింది విద్యాశాఖ మీదనే. పాదయాత్రలో తాను చూసిన సమస్యలను పరిష్కరించడం కోసం విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చూట్టారు. దానిలో భాగంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు.
మన బడి నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు సీఎం జగన్. వాటికి సర్వ హంగులు అది.. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేశారు. ఇక పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్ధేశంతో అమ్మ ఒడి కింద ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, షూస్, యూనిఫామ్, బుక్స్, డిక్షనరి ఇలా చదువుకోవడానికి అవసరమైన ప్రతిదీ అందిస్తున్నారు. అలానే ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచారు. హస్టల్ పిల్లలకు, పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనంలోనూ మెను మార్చి.. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించందుకు చర్యలు తీసుకున్నారు.
వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. విదేశాల్లో చదువుకోవాలనే పేద విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. మొత్తంగా గత పాలకుల వైఖరి వల్ల 40 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థకు సీఎం జగన్ తన సంస్కరణాల ద్వారా తిరిగి జీవం పోశారు. ఆయన తీసుకున్న చర్యలు నేడు మంచి ఫలితాలను ఇవ్వడమే కాక.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం జగన్ విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల స్ఫూర్తితో కేంద్ర కూడా పీఎం శ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి.. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయ సంకల్పించింది. ఈ క్రమంలో 40 ఏళ్ల విద్యావ్యవస్థను మార్చిన సీఎం జగన్ ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.