ఏపీలో అధికార, ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని.. ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని.. అందుకోసమే గతంలో వచ్చిన ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించారని అంటుంటే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను అధికార పార్టీ మభ్యపెడుతున్నారని ప్రతిపక్ష నేతలు అరోపిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో కాకుండా మరో సందర్భంగా ఒకే వేదికపై ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ ఇద్దరు నేతలు త్వరలో ఒకే వేధికపై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ భారీ ఎత్తున నిర్వహిస్తున్న “అజాదీ కా అమృత్ మహోత్సవ్” జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఇదే సమయంలో ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో ఏపీ సీఎం జగన్కూ ఆహ్వానం అందింది. జగన్ కూడా.. ఈ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సమావేశం తర్వాత ప్రధానితో రాష్ట్ర వ్యవహారల గురించి చర్చించబోతున్నట్లు సమాచారం. ప్రధాని ఆహ్వానానికి ప్రాధాన్యత ఇస్తూ.. చంద్రబాబు హాజరవుతున్నప్పటికీ.. జగన్ ఢిల్లీ భేటీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆహ్వానాల్ని ఎవరూ తిరస్కరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.