తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. తొలుత నారా లోకేష్కు కరోనా సోకింది. ఆ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే దేశంలోని చాలా మంది రాజకీయ ప్రముఖులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా.. చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఏకంగా భారత్ లోని చైనా రాయాబారి లేఖ రాయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చంద్రబాబు కరోనా వైరస్ బారిన పడటం పట్ల భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్టు తనకు తెలిసిందని. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా.. చంద్రబాబుకి ఈ రకమైన క్రేజ్ ఉండటం మామూలు విషయం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెట్టుబడుల కోసం చైనాలో సైతం పర్యటించిన విషయం తెలిసిందే. మరి.. చంద్రబాబు ఆరోగ్యంపై భారత్ లోని చైనా రాయబారి లేఖ రాయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.