Andhra Pradesh: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దలు. అంటే కుటుంబంలో చదువుకున్న మహిళ ఉంటే.. ఆ ఇల్లు బాగుపడుతుందని ఉద్దేశం. అక్షరాస్యత లేని సమాజం అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడా లేవు. సమసమాజ స్థాపనలో కీలక పాత్ర పోషించేది విద్య. ఏ ప్రభుత్వం అయినా సరే.. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు.. అక్కడ అభివృద్ధి వెల్లివిరుస్తుంది. అయితే దురదృష్టం కొద్ది మన స్వతంత్ర భారతంలో ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు.
అయితే ఒక్కరు తీసుకునే గొప్ప నిర్ణయం, మంచిపని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు.. నేడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్రం కూడా ఏపీ మోడల్ను అనుసరిస్తోంది. ఇంతకు ఏపీలో విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులు ఏవంటే…
అమ్మ ఒడి
పేదరికం వల్ల ఏ కుటుంబం కూడా తమ బిడ్డలను చదువుకు దూరం చేయకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. దీని కింద ప్రభుత్వం విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులు.
వసతి దీవెన..
ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ప్రతి ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది.
జగనన్న గోరుముద్ద..
మధ్యాహ్న భోజనం అంటే ఎంత నాసిరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిస్థితులను మార్చాలని భావించారు సీఎం జగన్. చదువుకునే పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించానలే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక మెనూ సిద్ధం చేసి దాన్ని అమలు పరుస్తున్నారు. దీనికోసం ఏటా రూ.1,600 కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. గతంలో రోజూ ఒకే రకమైన పదార్ధాలతో ఉండే మధ్యాహ్న భోజనాన్ని రోజుకో మెనూ ఉండేలా ముఖ్యమంత్రి తీర్చిదిద్దారు.
నాడు-నేడు..
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తీర్చిదద్దడం కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన కార్యక్రమం నాడు-నేడు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల కింద ఉన్న 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీని కింద పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదులన్నింటిలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం, సురక్షిత తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం సరిపడా ఫర్నిచర్, అన్ని పాఠశాలకు పెయింటింగ్, స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు చేయించడం, పాఠశాలల్లో ఆకుపచ్చ సుద్ద బోర్డులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్, పాఠశాలలకు కాంపౌండ్ గోడలు ఏర్పాటు చేయడం చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం..
ప్రస్తుతం పోటీ సమాజంలో నెగ్గుకు రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో బెండపూడి స్కూల్ను చూస్తే తెలుస్తుంది. అలానే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, షూస్, యూనిఫామ్, బ్యాగ్, డిక్షనరీ ఇలా విద్యార్థులకు కావాల్సిన వాటన్నింటిని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది.
విద్యార్థుల బాగు కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు నేడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్రం కూడా దేశవ్యాప్తంగా పలు పాఠశాలల్లో నాడు-నేడు తరహాలో పీఎం శ్రీ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఏపీ విద్యావ్యవస్థపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రైలులో కాన్పు చేయడం సులభం కాదు! చాలా భయం వేసింది: MBBS స్టూడెంట్ స్వాతి రెడ్డి