ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో తరచూ ఎదురయ్యే సమస్య.. చిల్లర సమస్య. దీని కోసం కండక్టర్, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత చిల్లర ఇచ్చేందుకు కొంతసేపు బస్సు ఆపాల్సిన పరిస్థితిలు కూడా ఎదరవుతుంటాయి. ఇకపై ఇలాంటి భాధలు అక్కర్లేదు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ఈ మేరకు APSRTC తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో కండెక్టర్ ఈ డిజిటల్ మిషన్ గురించి చెబుతున్నారు. “ప్రయాణికులందరూ తమ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఇక నుంచి టికెట్లు పొందవచ్చని, క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతూ ప్రయాణికులను అలర్ట్ చేస్తున్నాడు”. ప్రస్తుతం అన్ని చోట్లా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. తోపుడ బండ్ల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం బస్సుల్లో టికెట్ ఇచ్చే యంత్రాల (టిమ్స్) స్థానంలో ఈ- పాస్ యంత్రాలు రానున్నాయి. ప్రయాణికులు టికెట్ కు సరిపడా మొత్తాన్ని యూపీఐ పేమెంట్స్ యాపులద్వారా పే చెయ్యొచ్చు. అంటే.. ఫోన్ పే. గూగుల్ పే, పేటీఎం.. వంటి డిజిటల్ యాపుల ద్వారా చెల్లించవచ్చని అర్థం.
APSRTC Conductor Explaining about Accepting of Online/Digital Payments in Buses to the passengers#apsrtc #digitalpayments pic.twitter.com/mFHuBnuwbo
— APSRTC (@apsrtc) December 1, 2022