మీరు గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే మీరు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సిలబస్లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో తెలుసుకొని.. సన్నద్ధమవ్వండి.
గ్రూప్-2 అభ్యర్థులకు కీలక అప్డేట్ అందుతోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 సిలబస్లో భారీ మార్పులు చేసింది. అందుకు సంబంధించిన కొత్త సిలబస్ను తాజాగా విడుదల చేసింది. ఇకపై రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుండగా, రెండో దశలో 300 మార్కులకు గానూ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో అర్హత సాధిస్తేనే మెయిన్స్కు ఎంపికవుతారు. సిలబస్ జరిగిన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రూప్-2 ప్రిలిమ్స్ సిలబస్లో కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చారు. అభ్యర్థులు ఈ అంశాన్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. మెయిన్స్లో రెండు పేపర్లు ఉండగా, ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలపై, పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ప్రశ్నలుంటాయి.
పేపర్-1
పేపర్-2